- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బిగ్ న్యూస్: పరువు నష్టం కేసులో మాజీ MP రాహుల్ గాంధీకి ఊరట
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: పరువు నష్టం కేసులో కాగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ బెయిల్ పొడిగించింది. తనపై నమోదైన కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష రద్దు చేయాలని ఈ పిటిషన్లో కోరారు.
దీంతో ఈ కేసులో సెషన్స్ కోర్టు రాహుల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13 వరకు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సూరత్కు వచ్చారు. రాహుల్కు మద్దతుగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు.
Next Story