- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాయ్బరేలీలో రాహుల్ గాంధీకి షాక్..
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో రాహుల్, వయనాడ్ తో పాటు అమేథీ నుంచి పోటీలో ఉంటాడని తీవ్రమైన చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా.. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీ పోటి చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా.. శుక్రవారం నామినేషన్ కూడా వేశారు. ఇదిలా ఉంటే నిన్న నామినేషన్ వేసిన రాహుల్ ఈ రోజు రాయ్బరేలీలో కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. కాగా అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి కారణం సరిగ్గా తెలియనప్పటికీ.. అక్కడ సీటు ఆశించిన మరో కాంగ్రెస్ నేత అనుచరులు ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు మాత్రం 2019 లో మాదిరిగానే అమేతిలో ఓడిపోతాడనే నమ్మకంతో వయనాడ్ లో పోటీ చేసిన రాహుల్ గాంధీకి ఇప్పుడు అదే భయం పట్టుకుందని.. వయనాడ్లో ఓడిపోతామనే నమ్మకంతోనే రాయ్బరేలీలో రాహుల్ పోటీ చేస్తున్నాడని.. బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.