కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మోడీ

by  |
కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరుపుతున్నారు. ఎర్రకోట వద్ద కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో ప్రధాని ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల్లో కొద్దిమంది అతిథులు, 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబోతున్నారు. అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పాల్గొననున్నారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


Next Story