పీవీ సింధుకు మోదీ ధన్యవాదాలు

by  |
పీవీ సింధుకు మోదీ ధన్యవాదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రక్షాబంధన్‌ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. పీవీ సింధు శుభాకాంక్షలకు స్పందించిన మోదీ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే సమయంలో సింధును కొనియాడుతూ.. ఈ దేశానికి ఎన్నో బహుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశానికి మరెన్నో విజయాలను తీసుకొస్తారని ఆశిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారత దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed