టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం: అరవిందబాబు

by  |
టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం: అరవిందబాబు
X

దిశ, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవిందబాబు అన్నారు. బుధవారం నరసరావుపేటలోని 20వ వార్డు వాలంటీర్లు, కార్యకర్తలు వైస్సార్‌సీపీ‌కి రాజీనామా చేసి అరవిందబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద బాబు మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలను వాలంటీర్ల‌పై ఉసిగొల్పి మహిళలని కూడా చూడకుండా దాడులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిందని డ్వాక్రా గ్రూపుల స్థాపన నుంచి ప్రతి రంగంలో మహిళలను అభివృద్ధి పరచిన ఘనత టీడీపీదేనని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, పార్టీకి పూర్వవైభవం తెచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసి తీరుతామని అన్నారు. జగన్ పాలన రాక్షస పాలన మాదిరిగా ఉందన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ మాట్లాడుతూ.. వార్డు నాయకులు ఆధిపత్యపోరు వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేశామని స్పష్టం చేశారు.



Next Story