ఆయనే రూల్స్ పాటించకుంటే ఎలా : RRR

by  |
ఆయనే రూల్స్ పాటించకుంటే ఎలా : RRR
X

దిశ, వెబ్‌డెస్క్ :

తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆచారాలను గౌరవించాలన్న ప్రభుత్వం నిబంధనను సాక్షాత్తు సీఎం ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుబట్టారు.

అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తిరుమలలో జగన్ మాస్క్ కూడా పెట్టుకోలేదని, ఇతరులు వేలెత్తి చూపించేలా ఒక రాష్ట్ర సీఎం వ్యవహరించడం మంచి పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed