- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురంలో ఓ మహిళ పై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
అప్పు తీర్చలేదని మహిళా రైతు మంత్రూబాయిని ట్రాక్టర్ ఎక్కించి వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి క్రూరంగా చంపేశాడని అన్నారు. అధికారం తలకెక్కి ప్రజల పై దౌర్జన్యం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన తేల్చి చెప్పారు.
Next Story