దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?

by  |
దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌‌ను లక్ష్యంగా చేసుకొని నారా లోకేశ్‌ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో జరిగే సంఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో కిరణ్ కుమార్ అనే యువకుడు పోలీసుల దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై స్పందించిన నారా లోకేశ్ బాధితుల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌‌లో షేర్ చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేస్తూ.. మీ పాలనా క్రూరత్వానికి సోదరుడిని కోల్పోయిన సోదరి ఆక్రోశం మీకు వినిపిస్తోందా జగన్ అంటూ ప్రశ్నించారు. చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా? అంటూ నిలదీశారు. కేసును నీరుగార్చాలని చూస్తే సహించమని. ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ దళిత కుటుంబానికి న్యాయం జ‌ర‌గాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.


Next Story

Most Viewed