రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు

by  |
రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రైతులు కన్నీరు కార్చడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం దారుణమని విమర్శించారు. ఎన్నికేసులు పెట్టినా దగా మీటర్లు మాకొద్దని రైతులు అంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు. పంపుసెట్లకు మీటర్ల విషయంపై రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు.


Next Story

Most Viewed