కరోనా సాకుతో కక్షసాధింపు నీచం: లోకేశ్

by  |
కరోనా సాకుతో కక్షసాధింపు నీచం: లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాను కక్ష సాధింపు కోసం వాడుకునే నీచస్థాయికి జగన్ దిగజారిపోయారని టీడీపీ నేత లోకేశ్ విమర్శించారు. బెయిల్‌పై విడుదల అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై పెట్టాలని జగన్‌కు ఈ సందర్భంగా చురకలంటించారు. నేర స్వభావం ఉన్న జగన్‌కు అధికారం కట్టబెడితే ఇలా ఉంటుందని లోకేశ్ విమర్శించారు.



Next Story

Most Viewed