‘ప్రాణాలు పోతుంటే ఫిడేలు వాయించుకుంటున్నారు’

by  |
‘ప్రాణాలు పోతుంటే ఫిడేలు వాయించుకుంటున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌‌పై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతదేహాలు, విమ్స్ ఆస్పత్రి ఘటనలను లేవనెత్తిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం జగన్ తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా పెద్ద విషయం కాదు.. పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు అంటూ నిలదీశారు.

విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో పరిస్థితి నరకాన్ని తలపిస్తుందని చికిత్స పొందుతున్న వారు గగ్గోలు పెడుతున్నారని గుర్తు చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న నాధుడు లేడు అంటూ కన్నీరు పెడుతున్నారని.. ప్రజల్ని గాలికొదిలేసి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సంబరాల్లో మునిగిపోయిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు సంధించారు.


Next Story

Most Viewed