మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

by  |
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
X

ది్శ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో తనను కలవడానికి ఎవరూ రావొద్దని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.


Next Story

Most Viewed