నాగబాబు వివాదాస్పద ట్వీట్

by  |
నాగబాబు వివాదాస్పద ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేశారు. చాలా సున్నితమైన అంశం మతం గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హిందువులకి మత సామరస్యం మరి ఎక్కువ అయింది … కొంచెం తగ్గితే మంచిది అంటూ పోస్ట్ పెట్టిన నాగబాబు… మతాన్ని,సంస్కృతిని కాపాడాల్సిన మన సాములోర్లే జనాన్ని మోసం చేస్తే ఏమిచెయ్యగలం అంటూ మండిపడ్డారు. నాస్తిక, ఆస్తిక హిందువులందరు కలిసి హిందూ మతాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ విషయంలో దేవున్ని నమ్మే హిందువులు ఏమిచేస్తారో స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వమే ఒక మతాన్ని ఇలా తొక్కేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనా అని ప్రశ్నించారు. ఆదాయానికి హిందు దేవాలయాలను వినియోగించుకుంటూ … ఓట్ల కోసం ఇతర మతాలకి వత్తాసు పలకడం ఎంత వరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇలాంటి పర్యవసనాలను చూస్తే హిందూమతం అంతరించిపోవటానికి దగ్గరగా ఉందేమో అని భయమేస్తుందన్నారు నాగబాబు.

మన కళ్ళ ముందే మన దేవాలయాలకు చెందిన వేలాది ఎకరాల భూములు ఉంటాయా లేక మాయం అవుతాయా అనే విషయం అర్ధం కావటం లేదన్నారు. ఈ మత మాఫియా ప్లాన్స్ అర్థం కావటం లేదన్న నాగబాబు… బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ లాంటి హిందుత్వ సంస్థలు దీనికి పరిష్కారం చూపాలని కోరాడు. మాలాంటి నాస్తిక హిందువుల సపోర్ట్ కూడా మీకు ఉంటుందని స్పష్టం చేశాడు నాగబాబు.

Tags: NagaBabu, Jabardasth, NagaBabu Tweet, Hindu Religion


Next Story