ఆర్బీఐ నివేదికలో నా వ్యాఖ్యలు : రాహుల్

by  |
ఆర్బీఐ నివేదికలో నా వ్యాఖ్యలు : రాహుల్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాను చేసిన వ్యాఖ్యలు రుజువయ్యాయని రాహుల్ గాంధీ చెప్పారు. తాజాగా ఆయన ట్వీట్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగనంపై తాను కొన్ని నెలలుగా చేస్తున్న హెచ్చరికలనే తాజాగా రిజర్వ్ బ్యాంకు తన వార్షిక నివేదికలోనూ పేర్కొన్నదని ఆయన చెప్పారు. ‘పారిశ్రామిక వేత్తలకు పన్ను తగ్గింపు కాకుండా పేదలకు నగదు ఇవ్వండి. వినియోగాన్ని ప్రోత్సహించి దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించండి. మీ ప్రచారాలకు మీడియాను వాడుకున్నంత మాత్రన భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉందన్న విషయం కనిపించక మానదు’ అని రాహుల్ ట్విట్ లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed