నగ్నంగా ఆమె మృతదేహం.. అవాస్తవం

by  |
నగ్నంగా ఆమె మృతదేహం.. అవాస్తవం
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మేనేజర్​ దిశా సలియన్​ మరణించాక ఆమె డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవల మీడియాలో వార్తలు స‌ర్క్యూలేట్ అయ్యాయి. వాటిన ముంబై పోలీసులు ఖండించారు. అవన్నీ అవాస్తవాలని డిప్యూటీ కమిషనర్​ విశాల్​ ఠాకూర్​ స్పష్టంచేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారని.. ఆమె పేరెంట్స్ సమక్షంలోనే మృతదేహానికి పంచ‌నామా చేసినట్లు తెలిపారు.

జూన్​ 8న రాత్రి మలాద్​లోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి దిశ సలియాన్ సూసైడ్ చేసుకుంది. సరిగ్గా 5 రోజుల తర్వాత సుశాంత్​ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించాడు. ఈ రెండు ఘటనలు బాలీవుడ్​ సహా రాజకీయంగా క‌ల‌కలం రేపాయి.

రెండు వేర్వేరు ఘటనలను కొంత మంది నాయకులు రాజకీయ ప్ర‌యోజ‌నాల కోసం ఉపయోగించుకుంటున్నారని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ ఆరోపించారు. ఇప్పటికే తమ కుమార్తె మృతిపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దిశ​ ఫ్యామిలీ స్ప‌ష్టంచేసింది. ముంబై పోలీసులు చాలా నిజాయతీగా ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని.. తమను అపఖ్యాతిపాలు చేయాలని చూడటం బాధ కలిగించిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed