- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సెంట్రల్ డెస్క్: గత రెండు నెలల్లో కరోనాతో సమానంగా వార్తల్లో నిలుస్తున్న అంశం రిలయన్స్ జియో గురించే. వారానికొక భారీ ఒప్పందంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న రిలయన్స్ జియో కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ జియో ప్లాట్ఫామ్లో అడిషనల్ డైరెక్టర్గా అడుగుపెట్టనున్నారు. రానున్న కొద్దిరోజుల్లో రిలయన్స్ సంస్థ అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోన్నది. ఇప్పటికే అనంత్ సోదరుడు ఆకాశ్, సోదరి ఇషా డైరెక్టర్లుగా 2014 నుంచి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సమయంలో తల్లి నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ను అనంత్ ప్రోత్సహిస్తుండేవారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా అనంత్ కీలక ఉపన్యాసం చేశారు. ఆ సందర్భంలో రిలయన్స్ సంస్థలోని కుటుంబసభ్యులకు సేవ చేయడం తన లక్ష్యమని, భవిష్యత్తులో రాబోయే మార్పులకు ఇండియా నాయకత్వం వహించనుందని, ఆ మార్పులో రిలయన్స్ ముందుండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అనంత్ అంబానీ నాయకుడిగా ఎదగడానికి జియో సరైన వేదికని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అనంత్ తండ్రి ముఖేశ్ అంబానీ కూడా ఇదే వయసులో కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించారని కొందరు అభిప్రాయపడ్డారు.