అంతర్వేది ఘటన మూలకారకుడు అతడే -VS రెడ్డి 

by  |
అంతర్వేది ఘటన మూలకారకుడు అతడే -VS రెడ్డి 
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు అంటూ పరోక్షంగా చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

ఈ ట్వీట్ చేసిన కొంత సమయం తర్వాత ఘటనలో దోషులను హెచ్చరిస్తూ మరో ట్వీట్ చేశారు. “రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు చేసింది జగన్ గారి సర్కార్. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆయన చేసిన ఈ ట్వీట్ పై టీడీపీ కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. తుని రైలు తగుల బెట్టిన వారు టీడీపీ వారైతే కేసులెందుకు ఎత్తేశారు? కోడి కత్తి కేసేమైంది? బాబాయ్ మర్డర్ కేసేమైంది? అన్యమత ప్రచారాలపై చర్యలేవి? పింక్ డైమండేది? అధికారంలోకి వచ్చి యేడాదిన్నరైంది. చంద్రబాబు నాయుడు అవన్నీ చేస్తే చర్యలెందుకు తీసుకోవట్లేదంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed