ఫ్లకార్డు పట్టుకుంటే అరెస్ట్ చేస్తారా !: రేవంత్

by  |
ఫ్లకార్డు పట్టుకుంటే అరెస్ట్ చేస్తారా !: రేవంత్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఎందుకు కేసులు పెడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్ట్ అంశంపై పోలీస్ కమిషనర్‌తో ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు పంజాగుట్ట ఏసీపీకి, ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఏసీపీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని, అనంతరం ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేస్తే తాను లీవ్‌లో ఉన్నానని సమాధానం ఇచ్చారన్నారు. దీంతో పోలీస్ కమిషనర్‌తో మాట్లాడానని రేవంత్ వివరించారు. ఫ్లకార్డు పట్టుకుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బుధవారం రాత్రి నుంచి స్టేషన్‌లో ఎందుకు ఉంచారని, కేసు ఫైల్ చేసి పంపించాలి కదా అని అన్నారు. కేసును పరిశీలించి వదిలేస్తామని కమిషనర్ తెలిపారని రేవంత్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed