కృష్ణా రివర్‌ బోర్డు చైర్మన్‌తో రేవంత్‌ భేటి..

by  |
కృష్ణా రివర్‌ బోర్డు చైర్మన్‌తో రేవంత్‌ భేటి..
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలమంత్రిత్వ శాఖ మాత్యులు గజేంద్ర సింగ్ షెకాయత్ సమక్షంలో ఈనెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ భేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుండగా, అందులో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలోనే కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ను గురువారం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కలిశారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కమిటీ సమావేశం ఈ అంశాన్ని అజెండాలో చేర్చాలని రేవంత్‌ కోరారు.

2014లోనే దానికి సంబంధించి అనుమతులు, రూ.1450 కోట్లు కేటాయింపు కూడా జరిగిందని రేవంత్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్టు ఊసేలేకుండా పోయిందని ఆయన విమర్శించారు.


Next Story

Most Viewed