ఆ సీఎం.. ఎన్జీటీని బురిడి కొట్టించారు.

by  |
ఆ సీఎం.. ఎన్జీటీని బురిడి కొట్టించారు.
X

దిశ వెబ్ డెస్క్:
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ను సీఎం కేసీఆర్ పక్కదారి పట్టించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. పాత మ్యాపులను ఆయన మాయం చేశారన్నారు. వాటికి బదులు కొత్త మ్యాపులతో ఎన్జీటీని కేసీఆర్ బురిడి కొట్టించారని అన్నారు. కాగా సికింద్ర బాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలోని బ్రిటీష్ ఆస్పత్రిలో పాత మ్యాప్ ఉందన్నారు.

మూఢ నమ్మకాలతోనే దేవాలయాన్ని, మసీదును కూల్చేశారంటూ ఆయన ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఆలయాలను కూల్చిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సచివాలయ నిర్మాణానికి అనుమతులు వచ్చినట్టు సునీల్ శర్మ తెలిపారని అన్నారు. ఇప్పటికే రూ. 400కోట్ల నుంచి 700కోట్లకు అంచనాలను పెంచారని ఆయన వెల్లడించారు. తట్ట మట్టిని కూడా ఎత్తకుండానే దోపిడీకి తెరలేపారని అన్నారు.


Next Story