‘దమ్ముంటే ధర్నా చేయి కేసీఆర్’

by  |
‘దమ్ముంటే ధర్నా చేయి కేసీఆర్’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ధర్నా చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పై విమర్శలు చేశారు. నూతనంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట యమపాశంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకించాల్సింది పోయి.. టీఆర్ఎస్ నాయకులు గోతికాడి నక్కల్లా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed