- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సీజేఐ పదవి విరమణ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, గొగోయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జీత భత్యాలతో పాటు అలవెన్సులను కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ‘ఇండియా టుడే’ ఆర్టీఐ చట్టం సమాచారం సేకరించింది. రాజ్యసభ సభ్యుని హోదాలో వచ్చే జీత భత్యాలను గొగోయ్ వద్దనుకుంటున్నట్లు రాజ్యసభ సచివాలయానికి ఓ లేఖ రాసినట్లు సమాచారం.
‘ తాను రాజ్యసభ సభ్యుని హోదాలో పొందే జీతభత్యాల్లో ( ప్రయాణ ఖర్చులు మినహా) మిగతావి తీసుకోవడం లేదు. వీటికి బదులు సీజేఐగా పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చే ప్రయోజనాలను మాత్రం పొందాలని నిర్ణయించుకున్నానని’ అని రంజన్ గొగోయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. సీజేఐగా పదవీ విరమణ పొందాక తనకు రూ. 82,301పెన్షన్ వస్తోందని గొగోయ్ వెల్లడించారు.