- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: చిరంజీవి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సీఎం జగన్ కరోనా అవగాహన చిత్రం చేయాలని వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు మాస్కు పెట్టుకోవాలంటూ సినీ నటులు చిరంజీవి తదితరులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్న రఘురామ కృష్ణంరాజు, ఆయన కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న జగన్ ఓ మంచి కార్యక్రమం చేపడితే బాగుండు అని అభిప్రాయపడ్డారు. ఓ చక్కని చిత్రం చేసి.. ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.
తద్వారా కరోనా నియంత్రణ చర్యల్లో జగన్ ముందుండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్న ఆయన, సుమారు 20 కార్యక్రమాలు జగనన్న పేరుతో ఉన్నాయని గుర్తు చేశారు. జగనన్న పేరుతో ఈ వైరస్పై పోరాటం చేయాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. జగనన్న పేరు ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందని పేర్కొన్నారు. దీనికి జగనన్న కరోనా కేర్ అని కానీ, జగనన్న కరోనా వార్ అనో పేరు పెడితే బాగుంటుందని సూచించారు.