పొలం పనుల్లో ఎంపీ బిజీగా ఉన్నారు

by  |
పొలం పనుల్లో ఎంపీ బిజీగా ఉన్నారు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరలవుతోన్నది. ఏంటీ ఆ ఫొటో.. ఎందుకు అంతగనం వైరలవుతోందని ఆరా తీస్తే తెలిసిన విషయాలు ఇవి.. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీకి చెందిన ఎంపీ గొడ్డేటి మాధవి ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోన్నది. కరోనా విషయంలో ఆమె పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె పొలం పనులు చేస్తూ.. ఎడ్లతో దుక్కి దున్నుతూ బిజీగా ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి ఎంపీగా ఎదిగినా ఆమె ఆ మూలాలు మరిచిపోకుండా ఈ సమయంలో పొలం పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.



Next Story