జవాన్ శ్రీనివాస్ కుటుంబాన్ని సీఎం ఆదుకోవాలి : కోమటిరెడ్డి

by  |
జవాన్ శ్రీనివాస్ కుటుంబాన్ని సీఎం ఆదుకోవాలి : కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన పెద్దపల్లికి చెందిన జవాన్ శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల నగదుతో పాటు, జవాన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని లేఖలో సూచించారు. కాగా, సోమవారం జమ్ము కశ్మీర్ బారాముల్లాలో టెర్రరిస్టులు చేసిన దాడిలో శ్రీనివాస్ వీర మరణం పొందాడని ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.



Next Story