బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. ఆ ఇష్యూపై నోటీసులు జారీ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

by Satheesh |   ( Updated:2023-12-25 17:24:27.0  )
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. ఆ ఇష్యూపై నోటీసులు జారీ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ రోజున విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్, అతని సోదరునితో పాటు మరో పదహారు మందిని అరెస్ట్ చేశారు. కాగా, బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే గొడవలు జరిగినట్టుగా కేసులు నమోదు చేసిన పోలీసులు జరిగిన ఆస్తుల ధ్వంసం, అల్లర్లపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed