చెప్పులు, చీపుర్లతో కొడుతారు.. యాంకర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కమెడీయన్!

by Disha Web Desk 8 |
చెప్పులు, చీపుర్లతో కొడుతారు.. యాంకర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కమెడీయన్!
X

దిశ, సినిమా : తన యాంకరింగ్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న వారిలో శ్యామల ఒకరు. ఆమె యాకరింగ్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఏపీ ఎన్నికలు హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటూ అందరికీ షాకిస్తన్నారు. ఈ క్రమంలో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారం చేస్తోంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి, జనసేన,టీడీపీ పేర్లు తీయకుండా పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై పలువురు సెలబ్రిటీస్, జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల కామెంట్స్ పై సినీ నటుడు కమెడియన్ పృథ్వీ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నేను చేసిన లౌక్యం సినిమాలో ఆమె ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. రోజా, శ్యామల వంటి వారు వేరుగా మాట్లాడినా వారు ఒకటే, విశాఖ చాలా సుందర ప్రాంతమా.. అక్కడి ప్రతి వీధి దుర్గంధ పూరితంగా ఉంది. రెల్లి, వీధి మత్స్యకారులు నివసించే ఏరియా చాలా దారుణంగా ఉంది. ఆ ప్రాంతాల్లో అడుగు తీసి అడుగు పెట్టడం కూడా చాలా కష్టం కానీ శ్యామల అది సుందర ప్రాతం.. చాలా బాగా అభివృద్ధి చేశారని తెలిపారు. నువ్వు కానీ వారికి కనిపిస్తే అక్కడి జనం నిన్ను అలా కొడుతామని అంటున్నారు.. అవంతి శ్రీనివాస్ నీకు విశాఖ గురించి ఎక్కువ చెప్పుమని ఎక్కువ అమౌంట్ ఇచ్చారా అని ఆయన సెటైర్లు వేశారు. పదేళ్లు వైసీపీతో ఉన్న నాకు తెలియదా ఆ పార్టీ గురించి, అది ఒక టెర్రరిస్టు శిక్షణా శిబిరం అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ ఆరోపించారు. ఇక ఈయన జనసేన, టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story