తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమా?

by srinivas |
commit suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : పురుగుల మందు తాగి తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కనమనపల్లిలో శనివారం చోటుచేసుకుంది. తల్లి మహాలక్ష్మి, కూతురు నందిని పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కుప్పం ఆస్పత్రికి తరలించారు. తన పెద్దకూతురు కనిపించడంలేదని పీఎస్‌కు వెళ్లిన మహాలక్ష్మితో పోలీసులు అసభ్యంగా మాట్లాడారు.

దీంతో మనస్థాపం చెందిన ఆమె కూతురితో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story