ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని.. ప్రత్యేక పూజలు

by  |
ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని.. ప్రత్యేక పూజలు
X

దిశ, పటాన్‌చెరు: కరోనా బారి నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేగాకుండా బయటకు వెళ్లినప్పుడు మాస్కు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.


Next Story

Most Viewed