ఎవరూ మాస్కు లేకుండా బయటకు వెళ్లొద్దు..

by  |
ఎవరూ మాస్కు లేకుండా బయటకు వెళ్లొద్దు..
X

దిశ, ఖానాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామ పరిధిలోని నూతన చౌక ధరల షాపును ప్రారంభించారు. అనంతరం రేఖా నాయక్ మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమం పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో, ప్రతి కుటుంబనికి ఉచితంగా బియ్యాన్ని అందించి, నెలకు రూ.1500 చొప్పున ఆర్ధికసాయం అందించారని అన్నారు. ప్రజలు మస్కులు లేకుండా బయటకు వెళ్లొద్దని, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాధిని తరిమికొట్టాలని ప్రజలను కోరారు.



Next Story

Most Viewed