వాగులో తెప్పపై.. ఎమ్మెల్యే ప్రయాణం

by  |
వాగులో తెప్పపై.. ఎమ్మెల్యే ప్రయాణం
X

దిశ, ఆదిలాబాద్: ప్రజల కష్టాలను దూరం చేసేందుకు గంగాపూర్ వంతెన నిర్మించడం జరుగుతుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కడం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం అయిన గంగాపూర్ వద్ద కడం వాగుపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే స్వయంగా తెప్పపైన ప్రయాణం చేసి వాగును దాటి వెళ్లి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. వంతెన నిర్మాణ పనులను నాణ్యతగా చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.


Next Story