అబద్దాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్

by  |
అబద్దాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రానికి కరోనా నేపథ్యంలో ఎన్ని నిధులను కేటాయించారని పార్లమెంట్‌లో సంజయ్ అడిగిన ప్రశ్నకు 200 కోట్లు కెటాయించినట్టు కేంద్రం చెప్పిందన్నారు. అయితే 7వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని సంజయ్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రానికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయో బండి సంజయ్‌కు తెలుసా అని సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్రం నుండి పన్నుల రూపంలో చెల్లించగా వాటిని కేంద్రం ఇచ్చే డబ్బులని చెప్పడానికి బండి సంజయ్‌కు సిగ్గుందా అని ఘాటుగా విమర్శించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఎంపీగా సంజయ్ గెలిచాడని, కరీంనగర్‌కు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ బకాయిలను ఇప్పించి నిజమైన రాష్ట్ర అధ్యక్షుడివి అని అనిపించుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి కేంద్రం కెటాయించిన నిధుల విషయంలో బహిరంగ చర్చకు సిద్దమైతే తెలంగాణ చౌక్ కు రావాలని ఆయన అన్నారు.


Next Story

Most Viewed