అప్పుడు ఎందుకు మాట్లాడలేదు : అంబటి

by  |
అప్పుడు ఎందుకు మాట్లాడలేదు : అంబటి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన వైసీపీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలోనే ఆలయాలపై దాడులు జరిగాయని, అప్పుడు ఎందుకు మట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే హిందుమతంపై నిజంగా దాడి జరిగిందని, వీళ్లంతా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

ఇంతకుముందు అనేక మంత్రి ముఖ్యమంత్రులు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారని తెలిపారు. పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. దైవ సన్నిధికి ముఖ్యమంత్రి వెళ్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణం అన్నారు. అనవసర సమస్యలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాజకీయంగా ఎదుగుతుండటాన్ని ఓర్వలేక, దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.



Next Story

Most Viewed