మమ్మల్ని తొలగించడం అన్యాయం

by  |
మమ్మల్ని తొలగించడం అన్యాయం
X

దిశ, హన్మకొండ: వరంగల్ లో మిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నాలుగేళ్ల నుంచి తాము ఇంటింటా నీళ్లు అందించేందుకు రాత్రి, పగలు కష్టపడి పని చేస్తే కరోనా కష్టకాలంలో తమను విధుల నుంచి తొలగించడం అన్యాయం అంటూ ఫ్లకార్డులతో వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని మిషన్ భగీరథ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం అకారణంగా తొలగించిందని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed