ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

by  |
ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరోనా వార్డుల వద్ద పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.


Next Story

Most Viewed