- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్: వానాకాలం సాగుదృష్ట్యా ఆయకట్టు రైతుల కోరిక మేరకు ఎస్సారెస్పీ వరద కాలువను నింపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కోరారు. వరద కాలువలోని సాగునీటి ద్వారా పెద్ద ఎత్తున ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందని ఆయన ముఖ్యమంత్రికి ఆయకట్టు రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం, రైతుల సౌలభ్యం కోసం వెంటనే కాళేశ్వరం నీళ్లతో నింపాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఒక రైతుగా సాగునీటి కష్టాలు, అవసరాలు తెలుసు కాబట్టి వరద కాలువ కింద రైతుల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్కి చెప్పగానే వెంటనే సహృదయంతో స్పందించారని మంత్రి వేముల చెప్పారు. రైతు సంక్షేమం విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు అప్రమత్తం కావాలని, సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రైతులను కోరారు.