బేగంబజార్‌ డివిజన్‌లో మంత్రి పర్యటన

by  |
బేగంబజార్‌ డివిజన్‌లో మంత్రి పర్యటన
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంబజార్ డివిజన్‌లో పర్యటించారు. డివిజన్ పరిధిలో డ్రైనేజీ మరమ్మత్తుల కోసం రూ.60 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ నగర్‌లో నాలా నిర్మాణ పనులను మంత్రి తనిఖీ చేశారు. నాలా నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి పనులు సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బేగంబజార్‌లో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న శివాజీ నగర్ కమిటీ హాల్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, జలమండలి ఎండీ దానకిశోర్, కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story