నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు !

by  |
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాధుల బారిన పడుతున్న మూగజీవాలకు అందించే వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ, విజయ డెయిరీ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… జిల్లాల పర్యటన సమయాల్లో రైతులు అనేక పిర్యాదులు అందించారని, ముఖ్యంగా కొన్నిచోట్ల మందులు లేవని వైద్యులు చెబుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేరన్న పిర్యాదులే అధికంగా ఉన్నాయన్నారు.


Next Story