దద్దమ్మలు అడ్డుకోవాలని చూస్తున్నారు..

by  |
దద్దమ్మలు అడ్డుకోవాలని చూస్తున్నారు..
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా ఇవాళ విపక్షాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి తలసాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతకాని దద్దమ్మల అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రగతి భవన్‌ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. దేశంలోని 55 శాతం పంటలు తెలంగాణలో పండుతున్నాయన్నారు. గాంధీ కలలుకన్న స్వరాజ్యం కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన ఘటన ఈ ప్రభుత్వానికే ఉందని అన్నారు.



Next Story

Most Viewed