- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రైతు వేదికలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ చివరి నాటికి అన్ని క్లస్టర్లో నిర్మిస్తున్న రైతు వేదికలను పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ పనులు సెప్టెంబర్ చివరి నాటికి చేపట్టాలని, ఎనుగొండ దగ్గర ఏడు వందల ఇండ్ల పనులను ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఎకో పార్క్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అందుకు అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. అనంతరం నారాయణపేట జిల్లా నుంచి సివిల్స్లో ఉత్తీర్ణత సాధించిన రాహుల్ను మంత్రి సన్మానించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కవి భీంపల్లి శ్రీకాంత్ రాసిన చేనేత మొగ్గలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.