- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: జీవో 3ని కొనసాగించాలని సీఎం కేసిఆర్ మార్గదర్శనంలో సోమవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రారంభమైన మొదటిరోజునే ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్ఫుటం అవుతోందన్నారు. జీవోని కొట్టివేస్తే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, వారికి న్యాయం జరిగేలా ఈ జీవోను పునరుద్ధరించాలంటూ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె వివరించారు. ఇవేవి తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర నేతలు ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ జీవో 3ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
Next Story