ఇక ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ స్టార్ట్….

by  |
ఇక ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ స్టార్ట్….
X

దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకం నేడు ఎంతో మంది గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ పథకం కింద దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో 31మంది గిరిజన యువకులకు కార్లను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…ఈ పథకం కింద రెండేండ్లలో 500 మంది గిరిజనులు లబ్ది పొందారని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరో వేయిమందికి కార్లను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఒక్క ఎస్‌బీఐ ద్వారానే ఇప్పటి వరకు 2500మందికి ఇచ్చినట్టు తెలిపారు. ఇక గిరిజనులకు డిజిటల్ లిటరసీ అందించడం ద్వారా టెక్నాలజీలో వారిని నిష్ణాతులుగా మార్చి టెక్నాలజీ రంగంలో ఉపాధి కల్పించే ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ కార్యక్రమం కూడా ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు.



Next Story

Most Viewed