శిశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి

by  |
శిశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: శిశువులకు టీకాలు క్రమం తప్పకుండా వేసేలా నిరంతరం పర్యవేక్షించాలని మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పెండింగ్ వర్కులను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గురువారం హైదరాబాద్‌ సంక్షేమ భవన్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో నడిచేలా దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యలక్ష్మీ కింద నమోదు చేసుకునే గర్భిణీలకు ఎప్పటికప్పుడు సంరక్షణ కార్డు ద్వారా మందులు అందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను శానిటైజ్ చేసి జాగ్రత్తలు పాటించాలన్నారు.


Next Story

Most Viewed