ప్రతి గింజను కొనుగోలు చేశాం: సబితా

by  |
ప్రతి గింజను కొనుగోలు చేశాం: సబితా
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని తెలంగాణ సర్కార్ చేసిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మార్కెట్ కమిటీ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వికారాబాద్ జిల్లా కౌకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ… మార్కెట్ల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిలో శంకర్పల్లి మార్కెట్ ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రజాప్రతినిధులు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మార్కెట్ ఛైర్మన్ రాజు నాయక్, గుడి మల్కాపూర్ మార్కెట్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed