హైటెక్ సిటీకి దీటుగా ఇబ్రహీంపట్నం అభివృద్ధి

by  |
హైటెక్ సిటీకి దీటుగా ఇబ్రహీంపట్నం అభివృద్ధి
X

దిశ, ఇబ్రహీంపట్నం: హైటెక్ సిటీకి దీటుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డితో కలిసి నియోజకవర్గంలో ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

సీఎం కేసీఆర్ ఆధ్యర్యంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. ప్రతి ఏడాది పట్టణ ప్రగతి అభివృద్ధి కోసం రూ.178 కోట్ల మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. దీంట్లో రూ.78 కోట్లు మున్సిపాలిటీల అభివృద్ధి, రూ.70 కోట్లు జీహెచ్ఎంసీలకు కేటయించడం జరిగిందన్నారు.



Next Story

Most Viewed