ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

by  |
ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియకుండానే ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారు ఎల్ఆర్ఎస్​ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్​ ఆన్​లైన్​, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్​ (ఎల్ఆర్ఎస్​) ప్రజలకు మేలుచేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్‌కు​ సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్​ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.


Next Story

Most Viewed