చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్

by  |
చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు… 20మంది టీడీపీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి గెలవాలని సవాల్ విసిరారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. ఉప ఎన్నికల్లో టీడీపీ 20కి 20సీట్లు గెలిస్తే మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం పునరాలోచిస్తోందని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు ఓడించినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

రాయలసీమ ప్రాంతంలో 52సీట్లు ఉంటే చంద్రబాబు, బాలయ్య మాత్రమే గెలిచారన్నారు. అయినా చంద్రబాబు జూమ్‌ యాప్‌లో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి కంచుకోట అయిన ఉత్తరాంధ్రలోనూ చంద్రబాబుకు బుద్దిచెప్పారని, గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ లోకేశ్‌ను ఓడించారని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకేచోట లక్ష కోట్ల వ్యయంతో మహానగరం నిర్మించడం సాధ్యం కాదని.. అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 10శాతం విశాఖలో పెడితే అన్నిరంగాల్లో డెవలప్ చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేశారని అన్నారు. అన్నిప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. కానీ టీడీపీ నేతలు ఓర్వలేక గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.


Next Story