- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రైతుల నుంచి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకులో అతి త్వరలోనే మార్కెట్ యార్డు నిర్మిస్తాం. చెరకు పంటకు ప్రత్యామ్నాయ పంటను రైతులకు సూచిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత రాకుండా చూస్తామని చెప్పారు. ఎక్కడైనా డీలర్లు బ్లాక్ చేసినా.. అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఆర్బీకేల వల్ల బయట డీలర్లు కూడా తక్కువ ధరలకే అమ్మాల్సి వస్తుంది. ఇది రైతులకు శుభపరిణామం. ఆయిల్ పామ్ రైతులకు మెరుగైన ధర లభించడంతో వారు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏఎంసీ గోడౌన్స్ అన్నింటికీ అవసరమైన మరమ్మతులు చేయిస్తామని మంత్రి తెలిపారు.
Next Story