- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక నియోజకవర్గంలో 3 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… త్వరలో మీ ఇంటి స్థలంలో మీరే ఇళ్లు కట్టుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో, కొంచెం ఆలస్యం అయిదని వెల్లడించారు. బావులకు మీటర్లు పెడతానన్న చంద్రబాబుకే మీటర్లు పెట్టి పంపించామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ మన బోర్లు, బావులకు మీటర్లు పెడతానంటోందని, బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. కేసీఆర్ తెచ్చిన చట్టం రైతులకు మేలు చేకూర్చుతుందని అన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు.
Next Story