ఐక్యతకు నిదర్శనం.. జాతీయ స్థాయి అవార్డు

by  |
ఐక్యతకు నిదర్శనం.. జాతీయ స్థాయి అవార్డు
X

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట నియోజకవర్గానికి జాతీయ స్థాయి అవార్డు రావడం… గ్రామాల ఐక్యతకు నిదర్శనం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రి నివాసంలో గుర్రాలగొంది గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అవార్డు ప్రధానం చేశారు. గత జూన్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో సిద్ధిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామానికి గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పురస్కార్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును ప్రతిఏటా ఢిల్లీలో ప్రధానం చేస్తారు. ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలకు అవార్డులు పంపింది.


Next Story

Most Viewed